వరంగల్ నగరంలో ఇటీవల వైద్యుడిపై హత్యాయత్నం కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రియుడిపై మోజుతో భర్త(వైద్యుడు)ను మట్టుపెట్టే పన్నాగంలో భాగంగా హత్యాయత్నం చేయగా.. అతడు చికత్స పొందుతూ మృతిచెందాడు.
వరంగల్: వరంగల్ నగరంలో ఇటీవల వైద్యుడిపై హత్యాయత్నం కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రియుడిపై మోజుతో భర్త(వైద్యుడు)ను మట్టుపెట్టే పన్నాగంలో భాగంగా భార్యే ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్యుడు సుమంత్ రెడ్డి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు.
అసలేం జరిగిందంటే..
వరంగల్ హంటర్లో రోడ్లోని వాసవీకాలనీలో నివాసముంటున్న డాక్టర్ సుమంత్ రెడ్డి 2016లో ఫ్లోరా మరియాతో ప్రేమ వివాహమైంది. తన బంధువుల విద్యా సంస్థలను చూసుకునేందుకు 2018లో సుమంత్రెడ్డి భార్యతోసహా సంగారెడ్డికి మకాం మార్చారు. అక్కడ ఫ్లోరా ఉపాధ్యాయురాలిగా, సుమంత్ రెడ్డి పీహెచ్ లో కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్ గా చేరారు. సంగారెడ్డిలో జిమ్కు వెళ్తున్న క్రమంలో ఫ్లోరాకు శిక్షకుడు శామ్యూల్ తో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది.
విషయం వైద్యుడికి తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి… మళ్లీ వరంగల్కు మకాం మార్చారు. ఆమెకు 2019లో జనగామ జిల్లా పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో అధ్యాపకురాలిగా ఉద్యోగం వచ్చింది. తర్వాత ఆ కళాశాలను రంగశాయిపేటకు మార్చారు. అయినా, ఫ్లోరా ప్రవర్తనలో మార్పు రాలేదు. భర్త లేనిసమయంలో శామ్యూల్ని ఇంటికి పిలిచేది. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు జరిగాయి. దాంతో సుమంత్ రెడ్డి అడ్డుతొలగించుకోవాలని ఫ్లోరా, శామ్యూల్ నిర్ణయించుకున్నారు. ఇందుకు ఫ్లోరా రూ. లక్ష శామ్యూల్ కు ఆన్లైన్లో పంపింది. ఇందులో రూ.50 వేలను శామ్యూల్… సైబరాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన స్నేహితుడైన రాజ్కుమార్కు ఇచ్చాడు. వైద్యుడిని చంపితే ఇల్లు కట్టిస్తానని రాజ్ కుమార్ తో ఒప్పందం చేసుకున్నారు. పన్నాగంలో భాగంగా ఈనెల 20న రాత్రి వారిద్దరూ హెల్మెట్ ధరించి బైక్ పై వరంగల్ కు చేరుకున్నారు.
కాజీపేటలో ప్రైవేటు ఆసుపత్రిని నడుపుతున్న సుమంత్రెడ్డి రాత్రి విధులు ముగించుకొని కారులో ఇంటికి వస్తుండగా బట్టుపల్లిరోడ్లో కారు వెనుక భాగంలో సుత్తితో కొట్టారు. శబ్దం విన్న సుమంత్రెడ్డి కారును ఆపి బయటికి వచ్చి చూస్తుండగా అదే సుత్తితో పలుమార్లు అతని తలపై మోదారు. చనిపోయాడనుకుని పారిపోయారు. తీవ్ర రక్తస్రావమైన వైద్యుడిని స్థానికులు 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో.. తిరిగి వరంగల్కు తీసుకొచ్చారు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి సుధాకర్రెడ్డి ఫిర్యాదుతో… దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి, నిందితులను గుర్తించారు. ఇంట్లోని బంగారం అమ్మేందుకు వెళ్తున్న శామ్యూల్, రాజ్కుమార్, ఫ్లోరా మరియాలను గురువారం అరెస్టు చేశారు. దాడి వెనుక వైద్యుడి భార్యతోపాటు ఆమె ప్రియుడు ఉన్నట్లు తేల్చారు.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!