Vasantha Navaratri 2026: చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే తెలుగు నూతన సంవత్సరాది ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉన్న తొమ్మిది రోజుల పర్వాన్ని వసంత నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులు భక్తి, ఆధ్యాత్మిక మేల్కొలుపుకు ప్రతీకగా భావించబడతాయి. ఈ కాలంలో దేవీ ఉపాసన, వ్రతాలు ఆచరించడం వల్ల శారీరక, మానసిక శక్తులు పెరిగి సకల కార్యసిద్ధి కలుగుతుందని విశ్వాసం.
వసంత నవరాత్రుల ప్రత్యేకత..
వసంత నవరాత్రులను చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు. శ్రీరామనవమితో ముగియడం వల్ల వీటిని రామ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులు భక్తి, నియమ నిష్టలతో గడపడం ద్వారా ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందని భావిస్తారు.
రామాయణ పారాయణ ప్రాముఖ్యం..
ఈ సమయంలో లలితా సహస్రనామ పారాయణ, దేవీ పూజలు చేయడం ద్వారా జ్ఞానం, సంపద, బలం పెరుగుతాయని నమ్మకం. ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలతో రామాయణ పారాయణం చేసే ఆచారం విస్తృతంగా ఉంది. రామచంద్రుడిని లలితాదేవి స్వరూపంగా భావించే సంప్రదాయం కూడా ఉంది. రామలీలా ఉత్సవాల రూపంలో ఈ పూజలు నిర్వహించబడతాయి. దక్షిణ భారతదేశంలో అయితే శరన్నవరాత్రులలో దేవి ఆరాధనకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.
దేవి ఆరాధన విధానం..
నవరాత్రుల మొదటి రోజు కలశ స్థాపన చేసి దీక్ష ప్రారంభించాలి. ప్రతి రోజు ఉపవాసం పాటించి సాయంత్రం దేవి పూజ చేయాలి. లలితా సహస్రనామం, దుర్గా స్తుతి పారాయణ చేయాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించి, ప్రసాదం పంచాలి. ఒక ముత్తైదువును అమ్మవారి స్వరూపంగా భావించి ఆహ్వానించి సత్కరించడం శుభప్రదంగా భావిస్తారు.
శ్రీరామ పూజ విధానం..
వసంత నవరాత్రుల్లో శ్రీరాముని ఆరాధన కూడా విశేషంగా చేస్తారు. రోజూ ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీరామ పూజ చేసి రామాయణ శ్లోకాలు చదవాలి. రామ భజనలు చేయాలి. వడపప్పు, పానకం వంటి నైవేద్యాలు సమర్పించి, ప్రసాదం పంచిన తరువాత ఉపవాసం విరమించాలి.
శ్రీరామ పూజ విధానం.. వసంత నవరాత్రుల్లో శ్రీరాముని ఆరాధన కూడా విశేషంగా చేస్తారు. రోజూ ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీరామ పూజ చేసి రామాయణ శ్లోకాలు చదవాలి. రామ భజనలు చేయాలి. వడపప్పు, పానకం వంటి నైవేద్యాలు సమర్పించి, ప్రసాదం పంచిన తరువాత ఉపవాసం విరమించాలి.
పాటించాల్సిన నియమాలు.. ఇంట్లో అఖండ దీపం వెలిగించి ఉంచాలి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి భూశయనం పాటించాలి శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి భక్తిశ్రద్ధలతో నియమాలు కచ్చితంగా పాటించాలి ఈ విధంగా వసంత నవరాత్రులను ఆచరిస్తే దేవి అనుగ్రహం, శ్రీరాముని కృప లభించి కొత్త సంవత్సరంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం.
Also read
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..
- వారు బైక్పై ఇద్దరు వస్తున్నా.. రాత్రి సమయం అని ఇతనికి లిఫ్ట్ ఇచ్చారు.. కానీ కాసేపటికే..
- అనంతపురంలో జరిగింది ఇది.. తెలుసుకోకుంటే మీకే చాలా నష్టం..
- అలా అయితేనే నిన్ను ఇంట్లోకి రానిస్తాను.. భర్త పెట్టిన షరతుకు భార్యకు దిక్కుతోచని స్థితి
- భార్య కాపురానికి రాలేదని ఫ్రస్టేషన్లో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంత పని చేశాడో..
- ప్రభుత్వ ఆసుపత్రిలో రచ్చ.. చెప్పుల కోసం పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు!










