Vasantha Navaratri 2026: చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే తెలుగు నూతన సంవత్సరాది ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉన్న తొమ్మిది రోజుల పర్వాన్ని వసంత నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులు భక్తి, ఆధ్యాత్మిక మేల్కొలుపుకు ప్రతీకగా భావించబడతాయి. ఈ కాలంలో దేవీ ఉపాసన, వ్రతాలు ఆచరించడం వల్ల శారీరక, మానసిక శక్తులు పెరిగి సకల కార్యసిద్ధి కలుగుతుందని విశ్వాసం.
వసంత నవరాత్రుల ప్రత్యేకత..
వసంత నవరాత్రులను చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు. శ్రీరామనవమితో ముగియడం వల్ల వీటిని రామ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులు భక్తి, నియమ నిష్టలతో గడపడం ద్వారా ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందని భావిస్తారు.
రామాయణ పారాయణ ప్రాముఖ్యం..
ఈ సమయంలో లలితా సహస్రనామ పారాయణ, దేవీ పూజలు చేయడం ద్వారా జ్ఞానం, సంపద, బలం పెరుగుతాయని నమ్మకం. ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలతో రామాయణ పారాయణం చేసే ఆచారం విస్తృతంగా ఉంది. రామచంద్రుడిని లలితాదేవి స్వరూపంగా భావించే సంప్రదాయం కూడా ఉంది. రామలీలా ఉత్సవాల రూపంలో ఈ పూజలు నిర్వహించబడతాయి. దక్షిణ భారతదేశంలో అయితే శరన్నవరాత్రులలో దేవి ఆరాధనకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.
దేవి ఆరాధన విధానం..
నవరాత్రుల మొదటి రోజు కలశ స్థాపన చేసి దీక్ష ప్రారంభించాలి. ప్రతి రోజు ఉపవాసం పాటించి సాయంత్రం దేవి పూజ చేయాలి. లలితా సహస్రనామం, దుర్గా స్తుతి పారాయణ చేయాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించి, ప్రసాదం పంచాలి. ఒక ముత్తైదువును అమ్మవారి స్వరూపంగా భావించి ఆహ్వానించి సత్కరించడం శుభప్రదంగా భావిస్తారు.
శ్రీరామ పూజ విధానం..
వసంత నవరాత్రుల్లో శ్రీరాముని ఆరాధన కూడా విశేషంగా చేస్తారు. రోజూ ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీరామ పూజ చేసి రామాయణ శ్లోకాలు చదవాలి. రామ భజనలు చేయాలి. వడపప్పు, పానకం వంటి నైవేద్యాలు సమర్పించి, ప్రసాదం పంచిన తరువాత ఉపవాసం విరమించాలి.
శ్రీరామ పూజ విధానం.. వసంత నవరాత్రుల్లో శ్రీరాముని ఆరాధన కూడా విశేషంగా చేస్తారు. రోజూ ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీరామ పూజ చేసి రామాయణ శ్లోకాలు చదవాలి. రామ భజనలు చేయాలి. వడపప్పు, పానకం వంటి నైవేద్యాలు సమర్పించి, ప్రసాదం పంచిన తరువాత ఉపవాసం విరమించాలి.
పాటించాల్సిన నియమాలు.. ఇంట్లో అఖండ దీపం వెలిగించి ఉంచాలి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి భూశయనం పాటించాలి శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి భక్తిశ్రద్ధలతో నియమాలు కచ్చితంగా పాటించాలి ఈ విధంగా వసంత నవరాత్రులను ఆచరిస్తే దేవి అనుగ్రహం, శ్రీరాముని కృప లభించి కొత్త సంవత్సరంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం.
Also read
- ముగ్గురు అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి
- గోదావరిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
- ‘మా అల్లుడు సైకో’.. టెకీ రాధా గాయత్రి తల్లిదండ్రులు
- నీట్ కు సిద్ధమవుతున్న విద్యార్థిని బలవన్మరణం
- కన్నబిడ్డలతో రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య
- విశాఖ స్టీల్ ప్లాంట్లో మళ్ళీ కలకలం.. ఫైర్ బాల్ ఒక్కసారిగా ఎగసిపడటంతో భయం భయం..
- యువతి కుటుంబంపై కత్తితో దాడి.. వన్సైడ్ లవర్ అరెస్ట్
- Shiva Mantra: “ఓం నమః శివాయ” మంత్రాన్ని శివభక్తులు అంతగా జపించడానికి కారణం ఏంటి.. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
- మర్రి ఆకులను పూజలో వాడుతున్నారా? ఈ దేవతలకు సమర్పిస్తే శుభం.. వీరికి చేస్తే దోషమట!
- Vakshadhana: వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి.. లక్ష్మీదేవి, పరమశివుని అనుగ్రహం కోసం చేయాల్సిన పనులు ఇవే!










