నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కొందరు దుండగులు ఓ వ్యాపారవేత్తను కొట్టి కారులో బలవంతంగా లాక్కెళ్లారు.
హైదరాబాద్: నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కొందరు దుండగులు ఓ వ్యాపారవేత్తను కొట్టి కారులో బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో శిశువర్దన్రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందిన తక్షణమే పోలీసులు స్పందించారు. బాధితుణ్ని హైదరాబాద్ నుంచి కర్నూల్కు తరలిస్తుండగా సినీఫక్కీలో కిడ్నాపర్స్ వాహనాన్ని ఛేదించి పట్టుకున్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ కిడ్నాప్నకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Also read
- గరుడపురాణం ప్రకారం ఆత్మ నరకలోక ప్రయాణంలో 8వ పట్టణం విచిత్రభవనం చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా..?
- నేటి జాతకములు..2 మే, 2026
- చెడు కొలెస్ట్రాల్ను సహజంగా కరిగించే.. బెస్ట్ డ్రింక్స్ ఇవే!
- Andhra Pradesh: అయ్యో పాపం రాహుల్.. తల్లిదండ్రుల కళ్ల ముందే ప్రాణాలు విడిచి..
- ఎన్నడూ చూడని దృశ్యం.. 20 అడుగుల కొండచిలువ ఎలా చెట్టు ఎక్కుతుందో చూడండి..





