కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని రాఘవేంద్ర కాలనిలో మాధవ్ రెడ్డి, సరితా అనే దంపతులు జీవనం సాగిస్తున్నారు. సరితా ప్రభుత్వ టీచర్గా పని చేస్తుండగా, మాధవ్ రెడ్డి ఇంట్లో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే రోజు మాదిరిగా సరితా ఉదయం స్కూల్కు వెళ్లగా, మాధవ్ రెడ్డి 11 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి బైక్ రిపేర్ కోసం బయటకు వెళ్ళాడు. అప్పటికే ఆ ఇంటిపై కన్నేసిన ఓ దొంగ వెంటనే ఎంతో చాకచక్యంగా ఇంటికి ఉన్న తాళం తీయకుండా కొక్కికి ఉన్న స్క్రో లను తొలగించాడు. ఇంటిలోకి ప్రవేశించి బెడ్ రూమ్లో ఉన్న బీరువా తాళం పగలగొట్టాడు. అందులో ఉన్న 20 తులాల బంగారు నగలు, రెండు లక్షల నగదును అపహరించాడు. ఇంటికి వచ్చిన మాధవ్ రెడ్డి ఇంటి తలుపు తెరిచి ఉండటం, లోపల అన్ని సామాన్లు చెల్లాచెదురుగా ఉండడంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించాడు. వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన స్థలానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రప్పించి విచారణ చేపట్టారు.
Also read
- Jagannath Rath Yatra: భారతీయ కళాకారుల ప్రతిభకు నిదర్శనం జగన్నాథుని రథాలు.. ఎవరు? ఎలా తయారు చేస్తారో తెలుసా…?
- June 2025 Horoscope: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Sexual Assault: ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా – పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!
- Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.
- AP Crime: తిరుపతిలో విషాదం.. విహారయాత్రలో విద్యార్థి మృతి.. అసలేమైందంటే?