YSRCP: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. సహనం కోల్పోయిన స్థానిక ఎమ్మెల్యే శివ కుమార్ కు, ఓటర్ కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో ఓటర్ పై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేయి చేసుకున్నాడు.. ఆ వెంటనే ఎమ్మెల్యే శివ కుమార్ చంపపై తిరిగి ఓటర్ దాడి చేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే శివ కుమార్ అనుచరులు ఓటరుపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
కాగా, ఓటరుపై ఎమ్మెల్యే శివ కుమార్ దాడి చేసిన ఘటనపై ఎలక్షన్ కమిషన్, పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక, ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఇరువురు శాంతియుతంగా ఉండాలంటూ ఈసీ పేర్కొనింది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
Also read
- విహారయాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన నవ వధువు.. హోమ్స్టేలో రక్తపు మడుగులో మృతి
- నిజ జ్యేష్ఠ మాసం నేటి నుంచి ప్రారంభం- ఈ నెలలో వచ్చే పర్వదినాలు, పుణ్య తిథులు ఇవే!
- Garuda Purana : అమ్మ కడుపులో ఉన్నప్పుడే నరకం మొదలైపోతుందా, గరుడ పురాణం ఏం చెబుతోంది
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..




