మన్సూరాబాద్: చైనా మాంజాపై నగరంలో నిషేధం ఉన్నా విక్రయాలు మాత్రం తగ్గడంలేదు. నాగోలు ఫ్లైఓవర్ వద్ద జరిగిన ఘటనలో బైక్పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి చైనా మాంజా తగిలి తీవ్రంగా గాయపడ్డారు. హస్తినాపురం వందనపురి కాలనీకి చెందిన చీల రాజశేఖర్ మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో నాగోలు ఫ్లైఓవర్ వద్ద గాలిపటాల చైనా మాంజా నేరుగా ఆయన ముఖానికి చుట్టుకుంది. కత్తిలా పదునైన చైనా మాంజా ఒక్కసారిగా ముఖాన్ని చీల్చడంతో రాజశేఖర్ ముక్కుపై లోతుగా కోసుకుపోయి భారీ గాయంతో తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడు అప్రమత్తమై వాహనాన్ని పక్కకు నిలిపివేశాడు. స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





