కలుషితాహారం తిని 42 మంది బీటెక్ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన చెన్నైలోని ఈరోడ్లో చోటుచేసుకుంది.
ఈరోడ్: తమిళనాడులోని చెన్నైలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషితాహారం తిని అస్వస్థతకు గురి కావడంతో ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి భోజనం చేసిన విద్యార్థులు అసౌకర్యానికి గురై.. వాంతులు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పుడ్పెయిజనింగ్ అయినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వారందరినీ ఈరోడ్ జిల్లా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!