తితిదే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను భక్తులకు అధిక ధరలకు విక్రయించి, మోసగించిన దళారీని విజిలెన్స్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల, : తితిదే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను భక్తులకు అధిక ధరలకు విక్రయించి, మోసగించిన దళారీని విజిలెన్స్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తితిదే వింగ్ ఏవీఎస్ వో పద్మనాభన్ కథనం మేరకు.. తమిళనాడులోని సేలంకు చెందిన భక్తుడు కృష్ణస్వామి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చెందిన రాజశేఖర్ ను సంప్రదించారు. ఆయనకు 7 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పించేందుకు రాజశేఖర్ రూ.27 వేలు తీసుకున్నాడు. అనంతరం తితిదే పాలకమండలి సభ్యుడు సౌరభ్ సిఫార్సు లేఖ ఆధారంగా రాజశేఖర్ టికెట్లు పొందాడు. తితిదే విజిలెన్స్ వింగ్ అధికారులు గుర్తించి రాజశేఖర్ను అదుపులోకి తీసుకొని, తిరుమల పోలీసులకు అప్పగించి కేసుపెట్టారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!