SGSTV NEWS online
Andhra PradeshCrime

బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం



పుంగనూరు: చౌకదుకాణంలో రేషన్ సరుకులు తీసుకునేందుకు వెళ్తున్న బాలికను ఓ ఆటో డ్రైవర్ శనివారం ఆటోలో ఎక్కించుకుని అత్యాచారం చేసినట్లు బాధిత కుటుంబం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెంది న 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అటవీ ప్రాంతంలోకి తీసు కెళ్లి దాడి చేసి అత్యాచారం చేశాడని, తిరిగి ఆటో లో తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలాడని బాధిత కు టుంబం ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

Also read

Related posts