కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కారుపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. కొందరు ఇటుకలు, రాళ్లు, సీసాలతో దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు.
గొల్లప్రోలు, : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కారుపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. కొందరు ఇటుకలు, రాళ్లు, సీసాలతో దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు. పవన్ కల్యాణ్ విజయానికి సహకరించిన వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో భాగంగా వన్నెపూడి గ్రామ సర్పంచి కందా సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా స్థానిక దత్తాత్రేయస్వామి ఆలయం ఎదుట కొందరు వ్యక్తులు వర్మ కారును నిలిపి దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో కారులో వర్మతో పాటు తెదేపా మండల అధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు, జడ్పీటీసీ మాజీ సభ్యులు మడికి సన్యాసిరావు, బర్ల అప్పారావు తదితరులున్నారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ హనుమంతరావు, సీఐ శ్రీనివాస్, ఎస్సై బాలాజీ పరిశీలించి వర్మతో మాట్లాడారు. కొంతమంది తన కారుపై రాళ్లు, సీసాలతో దాడి చేశారని వర్మ తెలిపారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు భయపడేది లేదన్నారు. దాడిని నిరసిస్తూ గొల్లప్రోలు పోలీసే స్టేషన్ ఎదుట తెదేపా కార్యకర్తలు ధర్నా చేశారు.
Also read
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
- నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?






Kolkata: కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. అలా ఎలా చేస్తారంటూ..