వరంగల్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. పక్కింటి బాలికతో ఓ సీఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లి దండ్రులకు చెప్పడంతో వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పూర్తి వివరాలు
వరంగల్ పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. పక్కింటి బాలికతో ఓ సీఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికపై ఆ సీఐ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లి దండ్రులకు చెప్పడంతో వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వడ్డేపల్లిలోని పీజీఆర్ లేక్వ్యూ టవర్స్లో ఉంటున్న రవికుమార్ కాజీపేట సీఐ గా పనిచేస్తున్నాడు. సీఐ ఉంటున్న ఫ్లోర్లోనే నాలుగేళ్ళ బాలిక కుటుంబం నివాసం ఉంటున్నారు. పార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్తో మాట్లాడుతున్న బాలికను చూసిన సీఐ.. తనతో ఎందుకు మాట్లాడుతున్నావు, అతన్ని పంపించి…
ఇంట్లోకి రా అంటూ బాలికను బెదిరించాడు. భయంతో ఆ బాలిక సీఐ ఇంట్లోకి వెళ్ళింది.
బెడ్రూంలోకి లాక్కెళ్లి..
దాంతో సీఐ బాలికపై చేయి వేసి బెడ్రూంలోకి లాక్కెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో సీఐ నుంచి తప్పించుకున్న బాలిక.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు హుటాహుటిన వెళ్లి కాజీపేట పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీఐపై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీఐ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..