కాంబోడియా మానవ అక్రమ రవాణా ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని విశాఖ నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఆ దేశంలో ఉన్న పలు చైనా సంస్థల దగ్గర 158 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించామన్నారు.
విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్టుడే: కాంబోడియా మానవ అక్రమ రవాణా ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని విశాఖ నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఆ దేశంలో ఉన్న పలు చైనా సంస్థల దగ్గర 158 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 68 మందిని సురక్షితంగా తీసుకురాగా మరో 25 మంది స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ ‘ఈ కేసులో దేశవ్యాప్తంగా 21 మంది ఏజెంట్లు ఉన్నారు. వీరిలో ఓ మహిళ సహా 12 మందిని అరెస్టు చేశాం. కంపెనీల పేరిట నకిలీ బ్యాంకు ఖాతాలను సరఫరా చేస్తున్న వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం. ఆరుగురు ఏజెంట్లపై లుక్ అవుట్ సర్టిఫికెట్లను జారీ చేశాం’ అని వెల్లడించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులంటూ మభ్యపెట్టి కాంబోడియా ముఠా విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నుంచి రూ. 46 లక్షలు, ఒక వ్యాపారి నుంచి రూ.1.12 కోట్ల పెట్టుబడులను పెట్టించి మోసం చేసిందని సీపీ వెల్లడించారు.
Also read
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..
- SSC వాల్యుయేషన్లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!
- Andhra: ఏపీ MLC కారు మిస్సింగ్.. నిందితుడ్ని పట్టేసిన పోలీసులు.. అతని చెప్పింది విని షాక్
- నడిపేది రోడ్డు సైడ్ డాబా హోటల్ అనుకునేరు.. లోపల యవ్వారం చూస్తే సీన్ సితారే
- తాగి మైకంలో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ!
Sale of children : హైదరాబాద్ లో కలకలం.. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకువచ్చి..