నగరంలో డేటింగ్ స్కాం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ లో పరిచయమవుతున్న యువతులు.. యువకులను హైటెక్ సిటీలో ఓ పబ్కి తీసుకెళ్తున్నారు.
హైదరాబాద్: నగరంలో డేటింగ్ స్కాం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్లో పరిచయమవుతున్న యువతులు.. యువకులను హైటెక్ సిటీలోని ఓ పబ్కి తీసుకెళ్తున్నారు. అక్కడ ఖరీదైన మద్యం, ఇతర ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి యువతులు జారుకుంటున్నారు. ఇప్పటి వరకూ 8 మంది బాధితులుగా మారినట్లు తెలుస్తోంది.
టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్లో పరిచయం అవుతున్న యువతులు.. వెంటనే వాట్సాప్ ద్వారా కలుద్దామని సందేశాలు పంపుతున్నారు. యువకులను మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న పబ్లోకి తీసుకెళ్తున్నారు. గంటలో రూ.40 వేల వరకూ బిల్ చేసి జారుకుంటున్నారు. విషయం తెలుసుకునే లోపే బిల్ కట్టాలని యువకులపై పబ్ యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది. పబ్ నిర్వాహకులు, యువతులు కలిసి ఈ స్కాంకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తాము కూడా బాధితులమేనంటూ పలువురు ముందుకు వస్తున్నారు. అయితే.. దీనిపై ఇప్పటి వరకూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
Also read
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*





