కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కామ దహనం కార్యక్రమంపై భక్తులు మండిపడుతున్నారు. మన్మధుడితోపాటు ఆయన వాహనమైన రామ చిలుకను దహనం చేయడాన్ని హిందూ సంఘాలు తప్పు పడుతున్నాయి
AP News: కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో అపచారం జరిగింది. దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కామ దహనం కార్యక్రమంపై భక్తులు మండిపడుతున్నారు. మన్మధుడితోపాటు ఆయన వాహనమైన రామ చిలుకను దహనం చేయడాన్ని హిందూ సంఘాలు తప్పు పడుతున్నాయి. రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందిన రామ చిలుక దహనంపై హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రామ చిలుక దహణంపై శ్రీశైలం దేవస్థానం అర్చకులు, ఆలయ అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. హిందూ సమాజానికీ ఎలాంటి సందేశం ఇస్తున్నారని హైందవ సంఘాల నేత రవీందర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం పండితులు, వైదిక కమిటీ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





