గుంతకల్లు రైల్వే స్టేషన్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. 7వ నెంబర్ ప్లాట్ ఫార్మ్ వద్ద పెచ్చులూడి తలపై పడటంతో బాలుడు మృతి చెందాడు. వెయింటింగ్ హాల్లోని గోడపక్కనే తల్లి బాలుడిని నిద్రపుచ్చుతుండగా ఈ ఘోరం జరిగింది. మృతి చెందిన బాలుడి పేరు మణికంఠ 14 ఏళ్ళు
AP News: స్కూల్ లో పెచ్చులూడిపడి, పైకప్పు కూలి చనిపోయిన సంఘటనలు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే గుంతకల్ రైల్వే స్టేషన్ లో జరిగింది. అధికారుల నిర్లక్ష్యంతో బాలుడి ప్రాణం పోయింది. ఓ తల్లికి కడుపు కోత మిగిల్చింది.
పెచ్చులూడి
కర్నూలుకు చెందిన వెంకటేశ్వర్లు కుటుంబం కలిసి రామేశ్వరం వెళ్లడానికి తెల్లవారుజామున గుంతకల్లు రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు.
ట్రైన్ రావడానికి ఇంకా సమయం ఉండడంతో 7వ నెంబర్ ప్లాట్ ఫార్మ్ వద్ద వెయింటింగ్ హాల్లోని గోడపక్కన వెంకటేశ్వర్లు భార్య కొడుకును నిద్రపుచ్చుతుంది. ఈ క్రమంలో గోడ పెచ్చులూడి బాబు తలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మృతి చెందిన బాలుడి పేరు మణికంఠ 14 ఏళ్ళు అని తెలిసింది.
Also read
- జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!
- Vastu Tips: చాతుర్మాసంలో ఈ 5 పనులు తప్పక చేయండి.. ఇంట్లో ప్రతికూల శక్తి దూరం, లక్ష్మీ కటాక్షం మీ సొంతం!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Proddatur: బాబోయ్.. చూస్తేనే కడుపులో దేవుతుంది.. పాపం వాళ్ల పరిస్థితి ఊహిస్తేనే..
- పగలంతా ఇళ్లను గుర్తిస్తారు.. రాత్రిళ్లు దోచేస్తారు





