కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి–శిల్పారెడ్డి దంపతులు 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న నాగ సుధీర్ అనే యువకుడితో శిల్పారెడ్డికి పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. సంబంధం మరింత గాఢం కావడంతో భర్త ఈశ్వరరెడ్డిని హత్య చేయాలని ఇద్దరూ కలిసి కుట్ర పన్నారు. ఈ హత్యకు ప్రొద్దుటూరు రాజుపాలెంకు చెందిన స్థానిక నేత భూమిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి అనుచరుడు, రౌడీషీటర్ వినయ్ సహకారం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్లాన్ ప్రకారం, శిల్పారెడ్డి తన వద్ద ఉన్న 14 తులాల బంగారాన్ని ప్రియుడు నాగ సుధీర్కు ఇచ్చి, దానిలో కొంత అమ్మి, కొంత కుదవ పెట్టి సుమారు రూ.10 లక్షలు సమకూర్చి సుపారీ ఇచ్చినట్లు సమాచారం.
ఆ తరువాత వినయ్ ద్వారా హిందూపురానికి చెందిన కిరాయి ముఠాకు ఈ హత్య బాధ్యత అప్పగించారు. ప్రొద్దుటూరుకు చేరుకున్న ముఠా హత్యకు రెండు విధాలుగా ప్లాన్ సిద్ధం చేసింది. ఒకటి కారుతో ఢీ కొట్టి, కత్తులతో దాడి చేయడం.. అది సాధ్యంకాకపోతే పొలంలో పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేయడం. ఈ క్రమంలో ఈశ్వరరెడ్డి బైక్పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశారు. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన ఈశ్వరరెడ్డి అక్కడి నుంచి తప్పించుకుని ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హత్యాయత్నాన్ని భగ్నం చేశారు. గురువారం మొత్తం 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో శిల్పారెడ్డి, ఆమె ప్రియుడు నాగ సుధీర్, రౌడీషీటర్ వినయ్తో పాటు హిందూపురానికి చెందిన కిరాయి హంతకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- కన్నకూతురిపైనే అత్యాచారం.. తండ్రిపై పోక్సో కేసు నమోదు
- అన్నా భయంగా ఉంది.. చంద్రకళ ఏదేదో మాట్లాడుతుంది..!
- హైదరాబాద్ లో మహిళ అనుమానాస్పద మృతి..
- ఏం ప్లానయ్యా.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్.. అసలు మ్యాటర్ తెలిస్తే..





