కడప : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని కన్నెలూరు, నేతాజీనగర్లో కలుషిత నీరు తాగి సుమారు 30 మంది అస్వస్థతకు గురయ్యారు. జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలోని కొన్ని వార్డులకు చెందిన ప్రజలు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా తాగునీరు మురికిగా, దుర్వాసనతో వస్తుందని నగర పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also read
- స్మార్ట్ఫోన్ కొనడం ప్రాణాల మీదకు తెచ్చింది.. ఈఎంఐ భయంతో యువకుడి ఆత్మహత్య!
- ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ప్రిన్సిపల్ సంచలన నిర్ణయం!
- ఊరు మారిన మారని బుద్ధి.. మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ కార్యదర్శి!
- ఫేస్బుక్లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి వెళ్తే ఊహించని సీన్..
- సిగరెట్లే అతని టార్గెట్.. వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్





