కడప : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని కన్నెలూరు, నేతాజీనగర్లో కలుషిత నీరు తాగి సుమారు 30 మంది అస్వస్థతకు గురయ్యారు. జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలోని కొన్ని వార్డులకు చెందిన ప్రజలు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా తాగునీరు మురికిగా, దుర్వాసనతో వస్తుందని నగర పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also read
- ఇదేం పనయ్యా.. ప్రభుత్వ ఉద్యోగంలో లక్షకుపైగా జీతం.. చేసేదేమో చైన్ స్నాచింగ్లు
- 5 నెలలుగా ఇంటికి తాళం.. అనుమానంతో తెరిచిన ఓనర్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే దృశ్యం!
- ఏపీ లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
- అరేయ్.. ఏంట్రా ఇది.. హుండీ లెక్కింపు ఉద్యోగాలు.. అంటూ ఉన్నది మొత్తం ఊడ్చేశాడు.. చివరకు
- చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం.. బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుండగా పేలుడు.. బాలుడి చేయి ఛిద్రం!





