రూ.3,500 కోట్ల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.
మరోవైపు ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటివరకూ 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్టు చేసింది. ధనుంజయరెడ్డి (ఏ-31), కృష్ణమోహన్రెడ్డి (ఏ-32), బాలాజీ గోవిందప్ప (ఏ-33), పైలా దిలీప్ (ఏ-30)లు బెయిల్పై బయటకు రాగా.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేశ్నాయుడు సహా మొత్తం 8 మంది ఇంకా జైల్లోనే ఉన్న విషయం తెలిసినదే
Also read
- విశ్వకర్మ బీమా అమలు చేయాలి
- Andhra: జాతకం చెప్పే వేలిముద్రలు.. రైల్వేస్టేషన్లో తెల్లవారుజామున 4గంటలకు ఒక్కసారిగా అలజడి..
- సెల్ఫోన్లో గేమ్ ఆడుతున్నాడని బాలుని హత్య
- Andhra Pradesh: అలిగిన భార్య కోసం వెళ్లిన భర్త.. చుట్టుముట్టిన బంధువులు.. అయ్యో చివరకు..
- చిన్నారిపై లైంగిక దాడికి యత్నం





