నందివాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నందివాడ మండలం పెదలింగాలలో పదేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నానమ్మ లక్ష్మి (70)తో కలిసి బాలుడు బాలాజీ ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో బాలాజీ మృతిచెందగా.. వృద్ధురాలు లక్ష్మికి తీవ్రగాయాలయ్యా ఆమె విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉంది. నందివాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సిమెంట్ రాళ్లతో ఇరువురినీ బలంగా కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడు, వృద్ధురాలిపై దాడికి గల కారణాలు తెలియరాలేదు.
Also read
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్టాప్గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..
- ఇదేం ట్విస్ట్.. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు సూసైడ్.. సెల్పీ వీడియో కలకలం





