నందివాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నందివాడ మండలం పెదలింగాలలో పదేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నానమ్మ లక్ష్మి (70)తో కలిసి బాలుడు బాలాజీ ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో బాలాజీ మృతిచెందగా.. వృద్ధురాలు లక్ష్మికి తీవ్రగాయాలయ్యా ఆమె విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉంది. నందివాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సిమెంట్ రాళ్లతో ఇరువురినీ బలంగా కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడు, వృద్ధురాలిపై దాడికి గల కారణాలు తెలియరాలేదు.
Also read
- Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. లిఫ్ట్లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి!
- మాదాపూర్లో విషాదం: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఏం జరిగింది?
- Hyderabad: మరోసారి నేపాలి గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్ తో దోపిడీ!
- Garuda Puranam: గరుడ పురాణ హెచ్చరిక: సుఖశాంతులు కావాలా? అయితే ఈ 5 పాపపు పనులకు దూరంగా ఉండండి!
- ద్రౌపది పాండవులను వివాహం చేసుకోవడం వెనుక ఉన్న రహస్యం ద్విజన్మ రహస్యం!





