కృష్ణా జిల్లా కేసరపల్లిలోని శ్రీ చైతన్య గాయత్రి వేదవ్యాస్ క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనంతపురం జిల్లాకు చెందిన కప్పల యశ్వంత్(18) హాస్టల్ గదిలో మృతి చెందగా, ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.
కృష్ణా జిల్లా: గన్నవరం మండలం కేసరపల్లిలోని శ్రీ చైతన్య గాయత్రి వేదవ్యాస్ క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. అనంతపురం జిల్లాకు చెందిన కప్పల యశ్వంత్(18) అనే విద్యార్థి తన హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు క్యాంపస్కు చేరుకుని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారుడి మృతికి కారణాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు, విద్యార్థి తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు దౌర్జన్యం చేశారంటూ బాధిత తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ‘పోలీసుల దౌర్జన్యం నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో విద్యార్థి బంధువులను పోలీసులు ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




