July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

అర్ధరాత్రి బేకరీ నుంచి వింత శబ్దాలు.. ఏంటని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా.!



వాడొక చిల్లరదొంగ.. చేసేవన్నీ కూడా చిల్లర దొంగతనాలు.. అట్లాంటి.. ఇట్లాంటివి కాదు.. ఇటీవల మనోడు చేసిన ఓ దొంగతనం విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇక అవి చూసిన పోలీసులు దెబ్బకు ముక్కున వేలేసుకున్నారు. కక్కుర్తి ఉండాలి కానీ.. మరీ ఈ రేంజులోనా అంటూ నోరెళ్లబెట్టారు. కట్ చేస్తే.. ఆ చిల్లరదొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఖాకీలు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..


వివరాల్లోకెళ్తే.. పల్నాడు జిల్లాలోని గురజాల పట్టణం దాచేపల్లి మునిసిపాలిటీలో ఆదివారం అర్ధరాత్రి ఓ దొంగతనం జరిగింది. స్థానిక బేకరీలోకి ఓ దొంగ అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా దూరాడు. షాపులో నుంచి రూ. 2 లక్షలు చోరీ చేశాడు. ఇక దొంగతనం చేసే సమయంలో మనోడి యవ్వారం అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. అదేంటంటే.. షాపులోకి దూరిన దొంగ.. మొదటిగా కౌంటర్‌ దగ్గర ఉన్న డ్రాయర్ నుంచి రూ. 2 లక్షలు తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. అప్పుడే మనోడిలోని చిల్లర దొంగ బయటకు వచ్చాడు.

Also read

Related posts

Share via