ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు దేవాలయాలకు, దేవుడు విగ్రహాలకు రక్షణ లేకుండా పోతుంది. తాజాగా మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఆంజనేయ స్వామి విగ్రహంపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో హనుమాన్ భక్తులు విగ్రహం వద్దకు చేరి ధర్నా చేపట్టారు. నిందితులకు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామ శివారులో కొండల్లో నాలుగు నెలల క్రితం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని హనుమాన్ భక్తులు ఏర్పాటు చేశారు. రోజూ భక్తులతో పూజలను అందుకుంటున్న హనుమంతుడి విగ్రహంపై ఇద్దరు యువకులు దాడి చేశారు. మద్యం మత్తులో కొండమీదకు చేరుకొని అక్కడ ఉన్న విగ్రహంపై రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. రాళ్ల దాడితో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్న రైతులు గమనించి వెంటనే ఆ యువకులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఓ యువకుడు పరుగులు తీశాడు. పరారీ అయ్యాడు. మరో యువకుడు అక్కడ రైతులకు పట్టుపడ్డాడు ఆ యువకుడికి దేహాశుద్ధి చేసి, రూరల్ పోలీసులకు అప్పగించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఖాళీ ప్రదేశం కనబడితే అక్కడ మద్యం తాగుతూ, తాగుబోతులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానికులు కోరుతున్నారు
Also Read
- ప్రెస్ క్లబ్లో తన్నుకున్న INTUC నేతలు.. పిడిగుద్దుల వీడియో వైరల్!
- రూ.6 వేల కోట్ల భారీ కుంభకోణం.. UCO బ్యాంక్ డైరెక్టర్ అరెస్టు
- నేటి జాతకములు…20 మే, 2025
- విజయవాడ: బాగా మందేశాడు..! అమ్మాయిని బైక్పై ముందు కూర్చోబెట్టాడు.. ఆపై పాడు పని..
- ఇంత వైలెంట్గా ఉన్నారేంట్రా.. ఇద్దరి గొడవ మధ్యలో వేలు పెట్టింది.. కట్ చేస్తే..