తిరుపతిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ పై కేసు నమోదు అయ్యింది. యూట్యూబర్ కల్లూరి హేమాద్రి తోపాటు నాగవర్ధిని అనే మహిళ పై కూడా తిరుచానూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. తిరుపతి రూరల్ మండలం మంగళం క్వార్టర్స్లో ఉంటున్న యువతిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదు అందింది.
తిరుపతిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ పై కేసు నమోదు అయ్యింది. యూట్యూబర్ కల్లూరి హేమాద్రి తోపాటు నాగవర్ధిని అనే మహిళ పై కూడా తిరుచానూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. తిరుపతి రూరల్ మండలం మంగళం క్వార్టర్స్లో ఉంటున్న యువతిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హేమాద్రి ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ ద్వారా యువతికి అసభ్య మెసేజ్లు చేసి ఇబ్బంది పెట్టినట్లు పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో బాధితురాలు పేర్కొంది. గత 5 నెలలుగా తన కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. నువ్వంటే పిచ్చని లొంగకపోతే జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేసింది. లేదంటే కుటుంబ సభ్యులను కూడా చంపుతానని బెదిరించినట్లు పోలీసులకు బాధితురాలు తెలిపింది.
ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని కల్లూరి హేమాద్రి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. మంగళం క్వార్టర్స్ లో ఉన్న వివాహితను నాగవర్ధిని ఇంటికి పిలిపించి బెదిరించిన యూట్యూబర్ కల్లూరి హేమాద్రి బ్లాక్ మెయిల్కు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఈ మేరకు యూట్యూబర్ హేమాద్రి అతని సన్నిహితురాలు నాగవర్ధని ఇద్దరినీ అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడు గతంలోనూ ఇలాంటి ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసలు దర్యాప్తు చేపట్టారు
Also read
- కాళ్లు, చేతులు కట్టేసి..కడపలో వ్యక్తి దారుణ హత్య
- AP Crime: ఏపీలో రేషన్ మాఫియా అక్రమాల బాగోతం.. ప్రారంభమైన మరుసటి రోజే దందాలు
- AP News: ఏపీలో పవిత్రతకు విఘాతం.. గంగమ్మ జాతరలో యువకుల ఆకతాయి చేష్టలు
- Adilabad : ఓరెయ్ దరిద్రుడా.. భార్యతో బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించి
- తిరుమలలో చిరుత సంచారం.. ఆలయంపై విమానం చక్కర్లు..వీడియో.. అధికారులేమంటున్నారంటే