బాపట్లలో శిఖరం వారి వీధిలో నివసిస్తున్న అన్నదమ్ములు బొడ్డుపల్లి వెంకట సుబ్బయ్య శాస్త్రి, డాక్టర్ బాలసుబ్రమణ్యం అనారోగ్యం, ఒంటరితనం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పురుగుమందు కలిపిన ఆహారం తీసుకోవడంతో.. వీరితో పాటు వారి కుక్కలు కూడా మృతి చెందాయి. ఈ ఘటన స్థానికంగా విషాదకర చర్చనీయాంశంగా మారింది.
అది బాపట్లలోని శిఖరం వారి వీధి. ఎంతో కాలంగా అక్కడ ఇద్దరు అవివాహితులైన అన్నదమ్ములు నివసిస్తున్నారు. ఒకరు పంటి వైద్యుడు కాగా… ఇద్దరికి అరవై ఏళ్ల పైనే వయస్సు ఉంటుంది. అయితే వీరి నివసిస్తున్న ఇంటి నుంచి దుర్గధం వస్తుండటంతో స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి లోపలకి వెళ్లి చూసి నిర్ఘాంతపోయారు. అన్నదమ్ములిద్దరూ చనిపోయి ఉన్నారు. వీరితో పాటు ఉండే రెండు కుక్కలు కూడా చచ్చి పడి ఉన్నాయి. దీంతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శిఖరం వారి వీధిలో అన్నదమ్ములు బొడ్డుపల్లి వెంకట సుబ్బయ్య శాస్త్రి, డాక్టర్ బాలసుబ్రమణ్యం నివసిస్తున్నారు. వీరికి వివాహం కాలేదు. ఇద్దరికి వయస్సు అరవై ఏళ్లే పైనే ఉంటుంది. దీంతో తరుచు అనారోగ్యం బారిన పడుతున్నారు. వీరి బంధువులు గుంటూరులో నివాసం ఉంటున్నారు. సుబ్రమణ్యం పంటి వైద్యులుగా సేవలందిస్తున్నారు. అయితే అనారోగ్యం, వృద్ధాప్యం, ఒంటరితనం వేధిస్తుండటంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. వారు తినే ఆహారంలో పురుగు మందు కలుపుకొని ఉంటారన్న అనుకుంటున్నారు. వీరితో పాటు అదే ఆహారాన్ని తిన్న కుక్కలు కూడా చనిపోయాయి. దీంతో ఆత్మహత్యే అయి ఉంటుందని అనుకుంటున్నారు. నాలుగైదు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకొని ఉంటారని.. వాసన రావడంతో స్థానికులు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అన్నదమ్ములిద్దరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also read
- ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నా..
- Kadapa: ఏడ్చుకుంటూ పరుగున పోలీస్స్టేషన్కు వచ్చిన చిన్నారి.. ఏంటని ఆరా తీయగా
- Andhra: భర్త చేసిన అప్పు.. కట్ చేస్తే.. ఆపై మహిళను చెట్టుకు కట్టేసి.. చెంపదెబ్బలు కొట్టి..
- AP Crime : అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి….చంద్రబాబు సీరియస్
- నేటి జాతకములు 17 జూన్, 2025