అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలంవారిపల్లి సమీపంలో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న 5 మందిలో ముగ్గురు మృతి చెందారు. ప్రాణాలతో మరో ఇద్దరు బయట పడ్డారు. ఆదివారం(మే 18) తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొనివచ్చిన కారు అదుపు తప్పి బావిలోకి బోల్తా పడ్డట్లు స్థానికులు తెలిపారు.
మృతులను కర్ణాటకలోని కోలార్కు చెందిన వంట పని వారుగా గుర్తించారు పోలీసులు. బాలంవారిపల్లిలో జరుగుతున్న పెళ్లి వేడుకలో పంట పనులు చేసేందుకు వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని శివన్న, గంగరాజు, లోకేష్ గా గుర్తించగా సునీల్, తిప్పారెడ్డి అనే మరో ఇద్దరు ప్రాణాలతో బయట పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడ్డ కారును క్రేన్ సాయంతో స్థానికులు, పోలీసులు కలిసి బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కర్ణాటకలోని కోలార్ నుంచి వంట పనులు చేసేందుకు వచ్చిన ఐదుగురు మరికాసేపట్లోనే బాలంవారిపల్లి చేరుకునే సమయంలోనే ప్రమాదానికి గురి కావడంతో పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Also read
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..
- SSC వాల్యుయేషన్లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!
- Andhra: ఏపీ MLC కారు మిస్సింగ్.. నిందితుడ్ని పట్టేసిన పోలీసులు.. అతని చెప్పింది విని షాక్
- నడిపేది రోడ్డు సైడ్ డాబా హోటల్ అనుకునేరు.. లోపల యవ్వారం చూస్తే సీన్ సితారే
- తాగి మైకంలో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ!