కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోనెగొండ్ల మండలం ఆల్వాల గ్రామానికి చెందిన గాడిబండ బోయజు కర్నూలు నగరంలోని అద్దె ఇంట్లో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
కర్నూలు జిల్లా, జూన్ 25: కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోనెగొండ్ల మండలం ఆల్వాల గ్రామానికి చెందిన గాడిబండ బోయజు (24) కర్నూలు నగరంలోని అద్దె ఇంట్లో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బోయజు కొంతకాలంగా కర్నూలులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల తన స్నేహితురాలు (గర్ల్ఫ్రెండ్) ఫోన్లో మాట్లాడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. ఈ కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడు ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారం కారణంగా మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నాడా? లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తుల వాంగ్మూలాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డుల ఆధారంగా మరణానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించనున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also read
- Vijayawada: సాయికృష్ణ కేసు లో కీలక విషయాలు.. పోలీసు కస్టడీలో మృతి, మృతదేహం మాటేంటి?
- గర్ల్ఫ్రెండ్ ఫోన్ మాట్లాడలేదని మనస్తాపం.. యువకుడి మృతి
- షాకింగ్: కన్నకూతురే రాసిన రక్తచరిత్ర
- అయ్యో జానూ.. పోలీసుల కీలక నిర్ణయం
- గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు





