మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణా, మార్చి 19 మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మచిలీపట్నం ఇన్చార్జి డీఎస్పీ కె. ధర్మేంద్ర, ఆర్పేట సీఐ ఏసుబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన పూజారి రఘు (41) ఇంట్లో ఒక కుటుంబం అద్దెకు ఉంటుంది. వాళ్లకు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఉంది.
ఆ అమ్మాయిని ప్రలోభపెట్టి రఘు మూడుసార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆ బాలిక నీరసంగా ఉండటం అనారోగ్యానికి గురవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకెళ్లగా గర్భవతి అని తేలింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు కూతురిని నిలదీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ విషయంపై మచిలీపట్నం ఆర్పేట పోలీసులకు తల్లిదండ్రులు ఈ నెల 18వ తేదీన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
Also read
- వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి





