తిరుమల లడ్డూ కల్తీపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి అన్నారు.
తిరుమల: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ పోలీసులు ఇవాళ(సోమవారం) అదుపులోకి తీసుకున్నారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని.. అతని వాహనంలోనే తిరుపతికి తరలించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… కొద్ది రోజులుగా తన మనస్సు తల్లడిల్లిపోతోందని.. తాను ఏ తప్పు చేయలేదని… ఏ పరీక్షకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి చెప్పారు.
తన హయాంలో ఏదైనా తప్పు చేసి ఉంటే.. తాను.. తన కుటుంబం నాశనం అయిపోతామని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు కరుణాకర్ రెడ్డి యత్నించారు. లడ్డూలు కలంకితమైందని.. కలుషిత రాజకీయ మనుషులు ఆరోపణలు చేశారని అన్నారు. ఈ సమయంలో కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





