తిరుమల లడ్డూ కల్తీపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి అన్నారు.
తిరుమల: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ పోలీసులు ఇవాళ(సోమవారం) అదుపులోకి తీసుకున్నారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని.. అతని వాహనంలోనే తిరుపతికి తరలించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… కొద్ది రోజులుగా తన మనస్సు తల్లడిల్లిపోతోందని.. తాను ఏ తప్పు చేయలేదని… ఏ పరీక్షకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి చెప్పారు.
తన హయాంలో ఏదైనా తప్పు చేసి ఉంటే.. తాను.. తన కుటుంబం నాశనం అయిపోతామని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు కరుణాకర్ రెడ్డి యత్నించారు. లడ్డూలు కలంకితమైందని.. కలుషిత రాజకీయ మనుషులు ఆరోపణలు చేశారని అన్నారు. ఈ సమయంలో కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?
- పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..





