బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో యజమాని ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన గాయాలతోనే వారు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. దానితో పాటు మరో రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురంలోని రావులచెరువు వద్ద బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బాణసంచా తయారు చేస్తున్న ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిసర ప్రాంతాల్లోని మరికొందరు కూడా గాయపడినట్టుగా తెలిసింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. గాయపడిన వారందరినీ అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం కిమ్స్కు తరలించారు. ఆస్పత్రిలో బాధితులను స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు పరామర్శించారు.
బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో యజమాని ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన గాయాలతోనే వారు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. దానితో పాటు మరో రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇంట్లో దీపావళి మందు గుండు సామాగ్రి తయారు చేస్తుండగా ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు.
పేలుడు ధాటికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యామని స్థానికులు చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ కృష్ణారావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.. ధ్వంసమైన భవనం శిథిలాలను ప్రొక్లెయిన్ సాయంతో తొలగించారు
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




