రుద్రవరం : నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని రెడ్డిపల్లె గ్రామంలో నీటి తొట్టిలో పడి ఏడాది చిన్నారి మృతి చెందిన సంఘటన పలువురిని కన్నీరు తెప్పించింది. వివరాల్లోకెళితే… గ్రామానికి చెందిన చిన్న రాయుడు, నీరజ దంపతులకు ఇద్దరు కుమారులు వీరిలో చిన్న కుమారుడు సూర్య(1) కు ఏడాది వయస్సు ఉంది. తల్లిదండ్రులు ఇంటిదగ్గర పనులు చేసుకుంటూ ఉండగా చిన్నారి సూర్య ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి ఊపిరి ఆడక మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు దుఃఖంతో విలపించారు. చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Also read
- Kumkuma : కుంకుమ కింద పడితే అశుభం కాదా?
- జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఏమవుతుంది? శుభం లేదా అశుభం.. షాకింగ్ నిజాలు!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఈ అధిక మాసంలో ఒక్క శ్లోకం చదివితే చాలు.. 33 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యంతో పాటు ఎన్నో లాభాలు!
- ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు





