అనంతపురం క్రైం : అనంతపురం, హిందూపురం అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ (అహుడా) కార్యాలయంలో పని చేస్తున్న వార్డు ప్లానర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. అహుడాలో వార్డు ప్లానర్ నాగశ్రీ (32)కి ఎనిమిదేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ద్వారకేశ్వరరావుతో వివాహం అయ్యింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారు. వారికి మూడేళ్ల కుమార్తె ఆద్య ఉంది. అనంతపురం నగరంలోని మారుతీనగర్లో నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి ఫోన్లో భార్యాభర్తలు ఏదో విషయంపై మాటామాటా అనుకున్నారు. దీంతో మనస్తాపానికి లోనైన నాగశ్రీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు గుర్తించేలోపు ఆమె మరణించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





