అనంతపురం క్రైం : అనంతపురం, హిందూపురం అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ (అహుడా) కార్యాలయంలో పని చేస్తున్న వార్డు ప్లానర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. అహుడాలో వార్డు ప్లానర్ నాగశ్రీ (32)కి ఎనిమిదేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ద్వారకేశ్వరరావుతో వివాహం అయ్యింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారు. వారికి మూడేళ్ల కుమార్తె ఆద్య ఉంది. అనంతపురం నగరంలోని మారుతీనగర్లో నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి ఫోన్లో భార్యాభర్తలు ఏదో విషయంపై మాటామాటా అనుకున్నారు. దీంతో మనస్తాపానికి లోనైన నాగశ్రీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు గుర్తించేలోపు ఆమె మరణించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





