April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

అహుడా వార్డు ప్లానర్‌ ఆత్మహత్య



అనంతపురం క్రైం : అనంతపురం, హిందూపురం అర్బన్‌ అథారిటీ డెవలప్‌మెంట్‌ (అహుడా) కార్యాలయంలో పని చేస్తున్న వార్డు ప్లానర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. అహుడాలో వార్డు ప్లానర్‌ నాగశ్రీ (32)కి ఎనిమిదేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్‌ ద్వారకేశ్వరరావుతో వివాహం అయ్యింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారు. వారికి మూడేళ్ల కుమార్తె ఆద్య ఉంది. అనంతపురం నగరంలోని మారుతీనగర్‌లో నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి ఫోన్‌లో భార్యాభర్తలు ఏదో విషయంపై మాటామాటా అనుకున్నారు. దీంతో మనస్తాపానికి లోనైన నాగశ్రీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు గుర్తించేలోపు ఆమె మరణించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also read

Related posts

Share via