ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం ఎంప్లాయిస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ తీవ్రసంచలనం కలిగించింది. సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ నాగమణి రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. ఝాన్సీ అనే ఉద్యోగి నుండి లంచం తీసుకుంటూ నాగమణి ఏసీబీకి చిక్కారు.
ACB attacks : ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం లో ఎంప్లాయిస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ తీవ్రసంచలనం కలిగించింది. సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ నాగమణి 30 వేల రూపాయలు నగదు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. హాస్టల్లో స్వీపర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ అనే ఉద్యోగి నుండి లంచం డిమాండ్ చేయడంతో ఏలూరు లో ఏసీబీ ని ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.ఏలూరు ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ సీఐ ఎం బాలకృష్ణ, కే శ్రీనివాస్, రాజమండ్రి సీఐ ఎన్వి భాస్కరరావు పాల్గొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా?
- యామాలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఆరో పట్టణం క్రౌంచపురం – ఆత్మ ప్రయాణం అత్యంత కఠినం, వేదనాభరితమట.
- ఆ.. ఇంట్లో ఏమైందో?
- దంపతుల మధ్య గొడవ.. కొడవలితో దాడి చేసిన భార్య.. భర్త మృతి





