పాము కాటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో చోటుచేసుకుంది.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన సింధుజ(17) ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఇల్లు శుభ్రం చేస్తున్న క్రమంలో పాము కాటుకు గురైంది. ఎలుక కరిచిందని భావించిన కుటుంబసభ్యులు నిర్లక్ష్యం చేశారు. పాము కాటును సీరియస్ గా తీసుకోకుండా ఉండడంతో సాయంత్రం ఆమె నోటి నుంచి నురగలు రావడంతో భయాందోళనలకు గురయ్యారు. వెంటనే గమనించిన కుటుంబీకులు హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే బాలిక పరిస్థితి విషమించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం సూచించారు. దీంతో హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం (మార్చి 20) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా సింధుజ దౌల్తాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఒకేషనల్ కోర్సు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సింధుజ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also read
- ఇంట్లోంచి రూ.20 తెచ్చి.. ఢిల్లీ చూపిస్తానంటూ..! ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్
- క్యాష్ వ్యాన్లో సినిమా ట్విస్ట్.. రూ.17 లక్షలతో డ్రైవర్ మాయం.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- ఫ్యాక్షన్ సినిమాను మించిన ట్విస్ట్లు.. ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా ఎలా మారారో తెలిస్తే..
- మనవడే యముడయ్యాడు.. బైక్ కొనేందుకు నగలు ఇవ్వలేదని.. ఫ్రెండ్తో కలిసి..
- ప్రణవి ప్రాణం తీసిన ఫోన్..! పిట్ట గోడపై కూర్చొని మాట్లాడుతుండగా ఒక్కసారిగా..





