పాము కాటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో చోటుచేసుకుంది.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన సింధుజ(17) ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఇల్లు శుభ్రం చేస్తున్న క్రమంలో పాము కాటుకు గురైంది. ఎలుక కరిచిందని భావించిన కుటుంబసభ్యులు నిర్లక్ష్యం చేశారు. పాము కాటును సీరియస్ గా తీసుకోకుండా ఉండడంతో సాయంత్రం ఆమె నోటి నుంచి నురగలు రావడంతో భయాందోళనలకు గురయ్యారు. వెంటనే గమనించిన కుటుంబీకులు హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే బాలిక పరిస్థితి విషమించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం సూచించారు. దీంతో హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం (మార్చి 20) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా సింధుజ దౌల్తాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఒకేషనల్ కోర్సు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సింధుజ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also read
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..
- వారు బైక్పై ఇద్దరు వస్తున్నా.. రాత్రి సమయం అని ఇతనికి లిఫ్ట్ ఇచ్చారు.. కానీ కాసేపటికే..





