తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని నెయ్యి గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాము లోపల ఒక్కసారిగా మంటలు చెలరేగి సరకు మొత్తం కాలిపోయింది.
ప్రస్తుతం గోదాములో కొంతకాలంగా అల్లం, వెల్లుల్లిపాయలు నిల్వచేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదంలో గోదాములోని సరకుతో పాటు కారు కూడా దగ్ధమైంది. నష్టం భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. యజమాని అందుబాటులో లేకపోవడం వల్ల ఎంత నష్టం అనేది చెప్పలేమని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్చేస్తే.. 3 నెలల తర్వాత..





