దుమ్ముగూడెం, : మూసేసిన పాఠశాలను తిరిగి తెరిపించారని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని మావోయిస్టులు హత్య చేశారు. సుక్మా జిల్లా గోండ్పల్లికి చెందిన ఉపాధ్యాయుడు దూది అర్జున్(35) ఇంట్లో నిద్రిస్తుండగా ఆదివారం కొందరు మావోయిస్టులు అపహరించారు. సమీప అటవీప్రాంతంలో ఆదివాసీల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించి ఆయనపై పలు ఆరోపణలు చేశారు. మావోయిస్టులు కొంతకాలం కిందట గ్రామస్థులను బెదిరించి ప్రభుత్వ పాఠశాలను మూసివేయించారు. అధికారుల సహాయంతో ఇటీవల పాఠశాలను తిరిగి ప్రారంభించడంలో ఉపాధ్యాయుడు అర్జున్ ప్రముఖపాత్ర పోషించారు. దీంతో ఆగ్రహించిన మావోయిస్టులు ప్రజాకోర్టులో కర్రలతో కొట్టి.. హత్య చేసి మృతదేహాన్ని గ్రామ శివారులో పడేశారు.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




