యలమంచిలి టౌన్ (అనకాపల్లి) : అచ్చుతాపురం మండలం, పూడిమడక నుంచి చేపలు వేటకు వెళ్లి సముద్రంలో మత్స్యకారుడు తప్పిపోయాడు. ఉమ్మిడి జగన్ (గ్రామస్థులు) ప్రజాశక్తికి ఇచ్చిన వివరాల ప్రకారం …. పూడిమడక (కొండపాలెం)కి చెందిన పెనగాళ్ల సత్తయ్య మరొక ఆరుగురు కళాశీలతో కలిసి ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో చేపల వేటకు వెళ్లారు. వేట ముగిసిన తరువాత వెనక్కు వచ్చేస్తుండగా సుమారు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తీరంకి ముడువందల మీటర్లు దూరంలో ఉండగా ఒక్కసారిగా సముద్రం అల్లకల్లోలంగా మారటంతో, కుదుపుకు లోనైన పడవ తిరగబడి అందరు సముద్రంలో పడిపోయారు. కొద్దిసేపటి తరువాత జాలర్లు బోటు దగ్గరికి చేరుకున్నారు. కానీ బోటు యజమాని అయినా సత్తయ్య రాకపోవడంతో జాలర్లు సముద్రంలో గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో గట్టున ఉన్నవారిని తీసుకువద్దామని వెనక్కి వచ్చేశారు. అనంతరం పూడిమడకలో అధికారులకు, మత్స్యకారులకు సమాచారం ఇచ్చి, మరల దాదాపు పది బోటులలో యాబై మంది మత్స్యకారులను వరకు వెతుకుటకు తీసుకొనివెళ్లారు
Also Read
- ప్రేమ.. పెళ్లి.. కోటి రూపాయల మోసం! భార్యపై భర్త, అత్తింటి వారి దారుణ దాడి
- రికవరీ నగదు కాజేసిన న్యాయవాది.. ప్రశ్నించిన కానిస్టేబుల్ హత్యకు కుట్ర
- సహజీవనం.. మహిళ నాలుక కోసి పారిపోయిన ప్రియుడు
- ఇష్టమని ఎక్కువగా దోసెలు తిన్న బాలుడు.. కాసేపటికే ఘోరం!
- కలికాలం.. ఆస్తి కోసం కన్నతల్లి శవాన్ని ఎత్తుకెళ్లిన పెద్దకొడుకు.. శ్మశానంలో కోడిని పూడ్చిన చిన్నకొడుకు!





