*ఈ రోజుల్లో మహిళలు మీద జరుగుతున్న దాడులు, అభం,శుభం తెలియని చిన్నారుల పై పైశాచికంగా అఘాయిత్యాలు…రోజు రోజు కి మానవుడు ఒక మృగం లాగా తయారు అవుతున్న పరిస్థితితులు…చూసేమో?*
*అమ్మానాన్నకు చెప్పు.. మరో జన్మలో మగ పిల్లాడిలా పుడతా’…అని మెసేజ్ చేసి..ఆత్మహత్య చేసుకున్న వైనం*
మనస్థాపంతో డిగ్రీ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన హైదరాబాద్ కాప్రా మండలం జవహర్ నగర్ PS పరిధి సాయినగర్ కాలనీలో జరిగింది.
పోలీసులు వివరాల ప్రకారం..
మనస్థాపంతో శివానీ (18) అనే యువతి ‘ఆడపిల్ల అని బాధపడకండి.. మా అమ్మానాన్నకు చెప్పు.. మరో జన్మంటూ ఉంటే వారి కడుపునే మగపిల్లాడిగా పుడతా’ అని
తన స్నేహితురాలికి ఫోన్లో మెసేజ్ పెట్టింది. తర్వాత 2BHK భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్చేస్తే.. 3 నెలల తర్వాత..





