వైకాపా కార్యకర్త దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
దుగ్గిరాల: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో తెదేపా కార్యకర్త ఖాసీంపై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త క్రికెట్ బ్యాట్తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఖాసీంను కుటుంబ సభ్యులు మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. తెలుగుదేశం పార్టీ గెలిచిందన్న సంతోషంతో సంబరాలకు సిద్ధమవుతున్న ఖాసీంపై కమల్ బ్యాట్తో దాడి చేశాడని మృతుని బంధువులు తెలిపారు. వైకాపా ఓటమిని తట్టుకోలేక నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితులు వెల్లడించారు. కమల్పై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బాధితులు హెచ్చరించారు.
Also read
- నేటి జాతకములు…17 అక్టోబర్, 2025
- Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
- HYD Crime: హైదరాబాద్లో దారుణం.. బాత్రూం బల్బ్లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
- భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి.. పార్టీ ఇచ్చాడు!