వైకాపా కార్యకర్త దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
దుగ్గిరాల: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో తెదేపా కార్యకర్త ఖాసీంపై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త క్రికెట్ బ్యాట్తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఖాసీంను కుటుంబ సభ్యులు మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. తెలుగుదేశం పార్టీ గెలిచిందన్న సంతోషంతో సంబరాలకు సిద్ధమవుతున్న ఖాసీంపై కమల్ బ్యాట్తో దాడి చేశాడని మృతుని బంధువులు తెలిపారు. వైకాపా ఓటమిని తట్టుకోలేక నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితులు వెల్లడించారు. కమల్పై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బాధితులు హెచ్చరించారు.
Also read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





