తితిదే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను భక్తులకు అధిక ధరలకు విక్రయించి, మోసగించిన దళారీని విజిలెన్స్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల, : తితిదే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను భక్తులకు అధిక ధరలకు విక్రయించి, మోసగించిన దళారీని విజిలెన్స్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తితిదే వింగ్ ఏవీఎస్ వో పద్మనాభన్ కథనం మేరకు.. తమిళనాడులోని సేలంకు చెందిన భక్తుడు కృష్ణస్వామి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చెందిన రాజశేఖర్ ను సంప్రదించారు. ఆయనకు 7 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పించేందుకు రాజశేఖర్ రూ.27 వేలు తీసుకున్నాడు. అనంతరం తితిదే పాలకమండలి సభ్యుడు సౌరభ్ సిఫార్సు లేఖ ఆధారంగా రాజశేఖర్ టికెట్లు పొందాడు. తితిదే విజిలెన్స్ వింగ్ అధికారులు గుర్తించి రాజశేఖర్ను అదుపులోకి తీసుకొని, తిరుమల పోలీసులకు అప్పగించి కేసుపెట్టారు.
Also read
- హెల్మెట్ ఉన్నా దక్కని ప్రాణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
- మైలవరంలో విషాదం.. నదిలో మునిగి అత్త, అల్లుడు మృతి
- ఇద్దరు మహిళలతో భర్త.. చూసి పూనకంతో ఊగిపోయిన భార్య.. ఆ తర్వాత..!
- బస్సులో తెరచుకున్న అత్యవసర ద్వారం.. కిందపడి బాలికకు తీవ్రగాయాలు
- భార్య, అత్తామామల దాడి.. ఆర్మీ ఉద్యోగి మృతి





