పెర్కిట్(ఆర్మూర్): వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారిని కూలర్ బలితీసుకుంది. ఈ ఘటన ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్లో నివసించే దీపిక, వినీత్ దంపతులకు ఆరేళ్ల కూతురు శృతిక ఉంది.
ఎండాకాలం సెలవులు రావడంతో శృతిక పెర్కిట్లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. శనివారం రాత్రి అమ్మమ్మ వంట పనుల్లో నిమగ్నమై ఉండగా శృతిక ఆడుకుంటూ ఇనుప కూలర్ వద్దకు వెళ్లి, దానిని తాకింది. కూలర్కు విద్యుత్ ప్రసారం కావడంతో శృతిక విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. అప్పటివరకు ఆడుకుంటూ సరదాగా గడిపిన చిన్నారి అంతలోనే విగత జీవిగా మారడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




