YSRCP: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. సహనం కోల్పోయిన స్థానిక ఎమ్మెల్యే శివ కుమార్ కు, ఓటర్ కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో ఓటర్ పై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేయి చేసుకున్నాడు.. ఆ వెంటనే ఎమ్మెల్యే శివ కుమార్ చంపపై తిరిగి ఓటర్ దాడి చేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే శివ కుమార్ అనుచరులు ఓటరుపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
కాగా, ఓటరుపై ఎమ్మెల్యే శివ కుమార్ దాడి చేసిన ఘటనపై ఎలక్షన్ కమిషన్, పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక, ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఇరువురు శాంతియుతంగా ఉండాలంటూ ఈసీ పేర్కొనింది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
Also read
- పిల్లలను కారులో ఉంచి లాక్ చేయడంతో…కొంచమైతే ఎంతఘోరం జరిగేది?
- పోలీసోళ్లను పిచ్చోళ్లను చేసింది.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ !
- తిరుపతి అక్టోపస్ పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య..మర్డర్ వెనుక సంచలన విషయాలు
- నేటి జాతకములు..19 ఏప్రిల్, 2025
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!