యశవంతపుర: చేపల కూర తిని ఇద్దరు మృతి చెందగా, 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన హాసన జిల్లా అరకలగూడు తాలూకా బసవహళ్లి గ్రామంలో జరిగింది. గ్రామంలోని చెరువు వర్షాభావంతో అడుగంటింది. కొద్దిమేర నీరు ఉంది.
దీంతో గ్రామస్తులు శుక్రవారం చెరువులోని చేపలు పట్టుకొని కూర చేసుకొని తిన్నారు. కొద్ది సేపటి తర్వాత 15 మంది వాంతులు, విరేచనాలకు గురయ్యారు. వారిని అరకలగూడు, హాసన ఆస్పత్రికి తరలించగా రవికుమార్, పుట్టమ్మలు మృతి చెందారు. మిగతా 13 మంది చికిత్స పొందుతున్నారు. గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సీ సత్యభామ సందర్శించారు.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!