విశాఖ : ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా మత్తు ఇంజెక్షన్లను టాస్క్ఫోర్స్ సిబ్బంది గుర్తించి సీజ్ చేసిన ఘటన మంగళవారం జరిగింది. ఒడిశా కొరఫుట్ నుండి మత్తు ఇంజక్షన్లను తరలిస్తున్నట్లు ముందస్తుగా అందిన సమాచారం మేరకు … టాస్క్ఫోర్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వాహనాల తనిఖీలు చేపట్టారు. మద్దిలపాలెం బస్సు డిపోలో ఇద్దరు భార్యాభర్తలను అరెస్టు చేశారు. వారివద్ద 580 మత్తు ఇంజక్షన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎంవిపి పోలీసులకు అప్పగించారు. మత్తు ముఠా బాగోతం గుట్టు రట్టయిందని పోలీసులు తెలిపారు.
Also read
- Weekly Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశుల వారికి వారఫలాలు
- ఇన్స్టాగ్రామ్ వేదికగా అమ్మాయిలకు వల…లక్షల్లో వసూలు చేసిన ముఠా గుట్టు రట్టు
- వస్తున్నాయ్ ఫీలింగ్స్!
- నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్లావు..?
- ఆ నలుగురు పుచ్చకాయ తిని చనిపోలేదు!





