విశాఖ : ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా మత్తు ఇంజెక్షన్లను టాస్క్ఫోర్స్ సిబ్బంది గుర్తించి సీజ్ చేసిన ఘటన మంగళవారం జరిగింది. ఒడిశా కొరఫుట్ నుండి మత్తు ఇంజక్షన్లను తరలిస్తున్నట్లు ముందస్తుగా అందిన సమాచారం మేరకు … టాస్క్ఫోర్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వాహనాల తనిఖీలు చేపట్టారు. మద్దిలపాలెం బస్సు డిపోలో ఇద్దరు భార్యాభర్తలను అరెస్టు చేశారు. వారివద్ద 580 మత్తు ఇంజక్షన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎంవిపి పోలీసులకు అప్పగించారు. మత్తు ముఠా బాగోతం గుట్టు రట్టయిందని పోలీసులు తెలిపారు.
Also read
- అయ్యో భగవంతుడా.. మంచినీటి కోసం చేయి పెడితే.. ప్రాణమే పోయింది..!
- Bengaluru: రైల్వే ట్రాక్ పక్కన కనిపించిన సూట్కేస్.. తెరిచి చూడగా కనిపించిన దాన్ని చూసి నివ్వెరపోయిన స్థానికులు!
- Mahabubnagar: మాయదారి వ్యసనం ఎంత పని చేసింది.. కల్లుకు బానిసై ఆ ఇల్లాలు ఏం చేసిందంటే?
- Andhra: పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. బట్టబయలైన యువతీయువకులు బాగోతం
- Telangana: ఇది ప్రజెంట్ సొసైటీ.. అప్పు తీర్చలేదని సొంత చెల్లె ఇంటికి తాళం వేసిన అన్న..