వీకెండ్.. తెలంగాణ పోలీసులు పక్కాగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తారు. ఎవరైనా మద్యం తాగి డ్రైవ్ చేసినట్లు తేలితే వారిపై పక్కాగా కేసు నమోదు చేస్తారు. వాహనాలు స్వాధీనం చేసుకుని.. తర్వాత కౌన్సిలింగ్కు రావాలని చెబుతారు. ఇదంతా ఎప్పుడూ జరిగే ప్రాసెస్. వారంతం కావడంతో శనివారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణ కోత్వాల్గూడ చెన్నమ్మ హోటల్ వద్ద ఔటర్ రింగురోడ్డు-సర్వీసు రోడ్డు పరిధిలో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేశారు. ఇంతలో ఓ కారు అటు వైపుగా వచ్చింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి కంగారు పడుతూ కనిపించాడు. టెస్టు చేయగా.. మద్యం సేవించినట్లు తేలింది. దీంతో కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ కారును పక్కకు తీసుకెళ్తుండగా… అతడు తత్తరపాటు గురవ్వడంతో.. పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే కారులో తనిఖీ చేయగా.. రెండు అనుమానాస్పద బ్యాగులు కనిపించాయి.
తొలుత ఎన్నికల కోసం తరలిస్తున్న డబ్బు ఉంటుందేమో అనుకున్నారు. బ్యాగులు ఓపెన్ చేయగా.. గంజాయి గుప్పుమంది. పట్టుబడిన గంజాయిని తూకం వేయగా 50కిలోలుగా తేలింది. గంజాయిని.. సీజ్ చేసి.. తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తును ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గంజాయిని ఎక్కడి నుంచి.. ఎక్కడికి తరలిస్తున్నారు?.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనే వివరాల కోసం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.
Also read
- Srisailam: శ్రీశైలంలో రోడ్డు విస్తరణ చేస్తుండగా అద్భుతం.. తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శివ లింగం, శిలాశాసనం! వీడియో
- నేటి జాతకములు..6 జూలై, 2024
- డ్వాక్రా మహిళల అండగా.. బలరాముడి ఉద్యమం
- శ్రీగంధం దొంగిలించేందుకు వచ్చిన దుండగులు.. అటవీ అధికారులకు భలే దొరికిపోయారు..!
- తాగింది గోరంత.. మిషన్ చూపించేదీ కొండంత”.. లబోదిబోమంటున్న ఆటోవాలా..!