తణుక 27-04-2024
*పింఛన్ల పంపిణీ మీద వైసిపి కుట్రల్ని తిప్పికొడదాం*
*పింఛన్లు ఇంటికే పంపించాలి.. ఇదే తెలుగుదేశం డిమాండ్*
మే నెల ఒకటో తేదీనే ప్రతి ఇంటికి పింఛన్లు పంపించాలని తణుకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. పింఛన్ల విషయంలో వైసిపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని ఆయన పేర్కొన్నారు. తణుకు పట్టణంలోని మూడో వార్డు లింగం చెరువు తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రతీ ఇంటికి వెళ్లి వైసిపి నేతలు చేస్తున్న అరాచకాల్ని విడమర్చి చెప్పారు. టిడిపి కూటమికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. రాధాకృష్ణ పర్యటనకు అన్ని వర్గాల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాధాకృష్ణ ప్రచారంలో పాల్గొంటున్నారు .
ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ మీద వైసిపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బయటపెట్టారు. వాలంటీర్ల సేవల్ని మాత్రమే ఎన్నికల సంఘం దూరం పెట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ప్రతిపక్షాల పాత్ర ఏమీ లేదని తెలియజేశారు
Also read
- పరారీలో వైసీపీ నేత చింతాడ రవికుమార్
- August 2026 Horoscope: ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది..! అదృష్ట రాశులివే..
- Viral Video: దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్ షాపులో ఎలా చోరీలు చేస్తుందో చూడండి!
- ఏడాదిగా వెంటాడుతున్నాడు
- నేను చెప్పింది చెయ్! లేదంటే నీ ఫొటోలు అందరికీ..





