ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన
శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర ముగింపు సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి సింహ వాహనంపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించి మంగళ వాయిద్యాలు నడుమ తప్పెట్లు, డప్పు వాయిద్యాల మధ్య శ్రీ ముత్యాలమ్మ గ్రామోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో ఎస్.వి నాగేశ్వరరావు మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Also read
- Weekly Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశుల వారికి వారఫలాలు
- ఇన్స్టాగ్రామ్ వేదికగా అమ్మాయిలకు వల…లక్షల్లో వసూలు చేసిన ముఠా గుట్టు రట్టు
- వస్తున్నాయ్ ఫీలింగ్స్!
- నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్లావు..?
- ఆ నలుగురు పుచ్చకాయ తిని చనిపోలేదు!





