ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
తాజాగా, ఇద్దరు సీనియర్ ఐపీఎస్ లను బదిలీ చేసింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాలను బదిలీ చేస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.
ఆ ఇద్దరు ఐపీఎస్ లకు ఎన్నికల విధులతో సంబంధంలేని బాధ్యతలు అప్పగించాలని, వారి స్థానంలో కొత్తవారిని నియమించాలంటూ ఈసీ తన ఆదేశాల్లో ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఇటీవల ఈసీకి రాసిన లేఖలో రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్ అధికారుల తీరును వివరించినట్టు తెలుస్తోంది.
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు