Bhuvanagiri School : భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేకించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ (NCSC ) బృందాన్ని కేంద్రం ఆదేశించింది.
Bhuvanagiri School : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని సాంఘీక సంక్షేమ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేకించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ (NCSC ) బృందాన్ని కేంద్రం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 22న భువనగిరిలోని గురుకులాన్ని ఎన్సీఎస్సీ బృందం సందర్శించనుంది. అంతేకాదు.. ఫుడ్పాయిజన్ బాధితులు, విద్యార్థులు, చనిపోయిన ప్రశాంత్ కుటుంబ సభ్యులను అధికారులు కలవనున్నారు. దర్యాప్తు అనంతరం ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రానికి ఎన్సీఎస్సీ బృందం నివేదిక సమర్పించనుంది.
ఏప్రిల్ 12న భువనగిరి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుడ్ పాయిజన్ కారణంగా 26 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రశాంత్ అనే విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న మృతిచెందాడు. ప్రస్తుతం మిగిలిన విద్యార్థులకు చికిత్స కొనసాగుతుంది. ఫుడ్ పాయిజన్పై కేంద్రానికి నేషనల్ కమీషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ బృందం నివేదిక ఇవ్వనుంది.
Also read
- ఏపీ అసెంబ్లీలో సెగలు పుట్టించిన ‘కల్లీ నెయ్యి’.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన
- ‘గోవిందా’ అంటే అర్థం తెలుసా..? ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని తప్పక తెలుసుకోండి
- నేటి జాతకములు..25 ఫిబ్రవరి, 2026
- కృష్ణానదీ తీరాన నాగేశ్వరుడుగా వెలసిన శివుడు- పెదకళ్లేపల్లి క్షేత్రాన్ని దర్శిస్తే దోషాలన్నీ పరార్!
- అనారోగ్య కారణాలతో బాబా దగ్గరకు వెళ్లారు.. కట్ చేస్తే, క్షుద్రపూజలు, రూ.100 కోట్ల లక్ష్మీదేవి విగ్రహం.. ఏంట్రా ఇది!




