రామచంద్రపురం : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం దళితుల శిరోమండనం కేసు విచారణ 16కు వాయిదా పడింది. ఈ కేసులో ఇ ప్పటి కే పూర్తయిన సందర్భంగా ఈనెల 12న తుది తీర్పు వెలువరిస్తామని విశాఖ లోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల వెల్లడించింది. 28 ఏళ్లుగా దళితులు ఈ కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడుతుందని ఎదురు చూశారు. అయితే ప్రత్యేక న్యాయస్థానం జడ్జి శుక్రవారం సెలవు పై వెళ్లడంతో ఈ కేసును ఈ నెల 16 కు వాయిదా వేశారు. 16 వచ్చే తీర్పు కోసం దళితులు ఎదురుచూస్తుండగా మరోవైపు ఇందులో ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులు మండపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఈ తీర్పు కీలకం కానుంది.
Also read
- నన్ను చంపాలని అనేకసార్లు ప్రయత్నించారు.. జోగి రమేష్ కోడలు మేఘన
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..





